Content Text < < < Back to Menu
Tejaswi Kuchipudi Aarangetram on 3rd Aug 2012 at Ravindra Bharathi

రవీంద్రభారతిలో జరిగిన తేజస్వి కూచిపూడి రంగప్రవేశం


హైదరాబాద్ ఎన్ఎఎస్ ఆర్ (NASR) స్కూల్ కు చెందినా చురుకైన 9 వ తరగతి విద్యార్థిని తేజస్వి వరల్వార్ తన కూచిపూడి నృత్య రంగప్రవేశం ప్రథమ ప్రదర్శనను ౩ ఆగష్టు 2012న రవీంద్రభారతిలో ఇచ్చింది. శ్రీ కంచిరాజు విజయ శేఖర్ గారి శిష్యురాలైన తేజస్వి వరల్వార్ గణనాథుని స్తుతిస్తూ పురందరదాశాకీర్తన గజవదన తో తన కూచిపూడి రంగప్రవేశం ప్రారంభించింది.

తదుపరి జయదేవ అష్టావడి సంచారదారలోని రాధిక ఆలోచనలను అభినయించింది. కిక్కిరిసిన ఆడిటోరియం లోని ప్రేక్షకులు ఆమె హావభావాలకు, ప్రదర్శించిన తీరుకు ఆశ్చర్యం పొందారు. సంచారదార నృత్యమాలిక శ్రీ పద్మభూషణ్ డా.  వెంపటి చిన సత్యం గారిచే తీర్చదిద్దబడింది. తేజస్వి అన్నమాచార్య కీర్తన ద్వారా మంగంబూడి హనుమంత దేవుని కీర్తిస్తూ పాడిన పాటను అభినయించింది. తదుపరి మరకత మణి మాయాచేల అనే కూచిపూడి తరగం ప్రదర్శనను పళ్ళెంలో నర్తించింది. హంసానంది తిల్లాన ద్వారా తన పాదాలతో అద్భుతంగా నర్తిస్తూ ప్రదర్శన ముగించింది.

తేజస్వి వరల్వార్ పరిచయం: అతి చిన్న వయసులోనే కూచిపూడి నృత్యం పట్ల ఆసక్తి పెంచుకుంది. ఈ తెలివైన తేజస్వి హైదరాబాద్ ఎన్ఎఎస్ ఆర్ (NASR) స్కూల్లో 9 వ తరగతి చదువుతుంది. ఈమె తన 8 వ ఏటనే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకొనుట ప్రారంభించింది. గురువులైన శ్రీ. విజయశేఖర్ గారు తాను ప్రాథమిక నృత్య సూత్రాలు నేర్పారు. గురువుగారి పర్యవేక్షణలో కూచిపూడి నృత్యం లో తనను తాను ఉత్తమంగా తీర్చిదిద్దుకుంది. నృత్యమ తో పాటు తేజస్వి పాటలు పాడుట మరియు పియానో వాయించుట మొదలగు కళలలో ప్రావీణ్యం సంపాదించింది. సింగపూర్ లో జరిగిన ఒక నృత్య ప్రదర్శనకు తన స్కూల్ నుండి ప్రాతినిథ్యం వహించింది. ఇంకా అనేక నృత్య కార్యక్రమాలలో తన స్కూల్ తరపున పాల్గొని శ్రోతలను అలరించింది. ఆమె తన గురువు గారితో పాటు అనేక ప్రదర్శనలనిచ్చింది. తేజస్వి సంగీతం మరియు నృత్యం పట్ల తనకున్న ఆసక్తిని తనకు తానుగా కష్టపడి ఇంకా ఎంతో ఎదగాలని అభిలాషిస్తుంది

Content Photo Gallery < < < Back to Menu
Content Youtube Links < < < Back to Menu
No videos