Content Text < < < Back to Menu
National Lalitha Kala Research Council ‘Natya Sastra Parisodhakula Conference’ on 18th Aug 2012 at NTR Kala Mandiram

ఎన్.టి.ఆర్. కళామందిరంలో ఘనంగా జరిగిన ‘నాట్య శాస్త్ర పరిశోధకుల సదస్సు’

జాతీయ లలితకళా పరిశోధక మండలి (అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి, కూచిపూడి, కృష్ణాజిల్లా అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో ‘నాట్య శాస్త్ర పరిశోధకుల సదస్సు’ 18 ఆగష్టు 2012న డా. నందమూరి తారక రామారావు కళామందిరంలో ఘనంగా జరిగింది.

చెన్నై – మ్యూజిక్ అకాడమీ కార్యదర్శి డా. శ్రీ పప్పు వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. శ్రీ ఆర్.వి. ప్రసాదరాజు గారు (శ్రీ కవితా ప్రసాద్) సభను ప్రారంభించగా, మండలి వ్యవస్థాపక కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా హైదరాబాద్ – తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య శ్రీ కె. యాదగిరి గారు, నృత్యశాఖాధిపతి – కేంద్రీయ విశ్వవిద్యాలయం – హైదరాబాద్ డా. శ్రీమతి తడకమళ్ళ (జొన్నలగడ్డ) అనురాధ గారు, సిద్ధేంద్రయోగి కళాపీఠం – కూచిపూడి ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్త్రి గారు, నృత్యశాఖాధిపతి – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ శ్రీ భాగవతుల సేతురామ్ గారు పాల్గొన్నారు.

చెన్నై – మ్యూజిక్ అకాడమీ కార్యదర్శి డా. శ్రీ పప్పు వేణుగోపాలరావు మాట్లాడుతూ

కూచిపూడి నాట్యంపై పరిశోధనలు చేసి కళ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన బాధ్యత పరిశోధకులపై ఉందని అన్నారు. కళను ప్రేమతో నేర్చుకోవాలని చెప్పారు.

తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య శ్రీ కె. యాదగిరి గారు మాట్లాడుతూ

సాంకేతిక విద్యతో సమానంగా సాంస్కృతిక విద్యను పాఠశాలలో బోధించాలని అన్నారు.

కార్యక్రమంలో ఉమారామారావు, డాక్టర్ అలేఖ్య, డాక్టర్ కుసుమారెడ్డి, డాక్టర్ సుమిత్ర పార్థసారథి, డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు.

Content Photo Gallery < < < Back to Menu
Content Youtube Links < < < Back to Menu
No videos